Petrol Price Cut in Jharkhand : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ఝార్ఖండ్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోలుపై ఏకంగా రూ.25 తగ్గించింది. ఈ రాయితీ ద్విచక్రవాహనదారులకు మాత్రమే వర్తిస్తుందని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ వెల్లడించారు. ఇది 2022, జనవరి 26 నుంచి అమలు చేస్తున్నట్టు తెలిపారు.
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు దేశంలో ఏమాత్రం తగ్గడం లేదని.. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలపై తీవ్ర భారం పడుతోందని అన్నారు. అందుకే ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజలకు ఊరట ఇవ్వాలని నిర్ణయించామని సీఎం హేమంత్ సొరెన్ వెల్లడించారు. దేశంలో పెట్రోల్ ధర గత కొన్ని నెలలుగా రూ.100కు పైనే ఉండడం తెలిసినదే.