Hidden treasure found in Yadadri : తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయ పొలాన్ని కూలీలు దున్నుతుండగా బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. కథనాల ప్రకారం విలువైన వస్తువులు మట్టి కుండలో దాచి ఉంచిన ఘటన యాదాద్రి జిల్లా కుకుందుపాముల గ్రామంలో చోటుచేసుకుంది. కన్నబోయిన మల్లయ్య పొలంలో కార్మికులు ఇనుప పెట్టె, మట్టి కుండను గుర్తించినట్లు తెలిసింది.
నిధిలో తనకు వాటా కావాలని సోదరుడు అడగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మల్లయ్య పోలీసులకు సమాచారం అందించగా రెవెన్యూ అధికారులు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వెండి నాణేలపై ఉర్దూ ఉందని గుర్తించిన అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు.