Tata Group is New IPL Title Sponsor : జనవరి 11న సమావేశమైన ఈవెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్గా టాటా కంపెనీ వ్యవహరించనుంది. ఇప్పటి వరకు ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్గా కొనసాగుతున్న చైనా కంపెనీ ‘వివో’తో బీసీసీఐ బంధం తెంచుకున్నట్లు తెలుస్తోంది
‘అవును, టాటా గ్రూప్ ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్గా వస్తోంది” అని ఐపిఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ పిటిఐకి ధృవీకరించారు. Vivo 2018 నుండి 2022 వరకు టైటిల్ స్పాన్సర్షిప్ హక్కుల కోసం రూ. 2200 కోట్ల ఒప్పందాన్ని కలిగి ఉంది, అయితే 2020లో ఇండియా మరియు చైనా సైనికుల మధ్య గాల్వాన్ వ్యాలీ సైనిక ఘర్షణ తర్వాత, కంపెనీ దానిని Dream11 తో భర్తీ చేసింది. ఐపీఎల్ 2022 మెగా వేలం ఫిబ్రవరి రెండో వారంలో బెంగళూరులో జరగనుంది.