ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో దుబాయ్లోని అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై శనివారం రాత్రి బతుకమ్మను ప్రదర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద తెరపై బతుకమ్మను ప్రదర్శించారు. దేశవిదేశాలకు చెందిన లక్షల మంది ఒకేసారి బుర్జ్ ఖలీఫా స్క్రీన్ పై బతుకమ్మను వీక్షించారు.
మన సంస్కృతి, ఖ్యాతిని చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ జాగృతి వర్గాలు తెలిపాయి. దుబాయ్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సైతం హాజరైనారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9.40కి, 10.40కి బుర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ వీడియో ను ప్రదర్శించారు.