దీపావళి టపాసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బేరియం సాల్ట్తో తయారు చేసిన క్రాకర్స్ను ఎట్టి పరిస్ధితుల్లోనూ అమ్మరాదని ఇటీవల సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయించింది. బేరియం సాల్ట్తో తయారు చేసిన క్రాకర్స్ను అమ్మొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా అమలు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేసించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని వ్యాపారులను హెచ్చరించారు.