57.5 Increase in Cancer Cases in 20 Yrs : ప్రపంచవ్యాప్తంగా కఠినమైన అనారోగ్య సమస్యలకు సైతం ఔషధాలు, చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. అయినా కొన్ని వ్యాధులు మాత్రం అంతు చిక్కడం లేదు. అందులో ప్రధానమైనది క్యాన్సర్. ఎన్ని పరిశోధనలు జరుగుతున్నా క్రమంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడమే దీనికి నిదర్శనం. 2020-40 మధ్య భారత్లో క్యాన్సర్ కేసులు 57.5శాతం పెరుగుతాయని తాజాగా I.C.M.R కూడా హెచ్చరించింది.
ఈ వ్యాధి నిర్థారణ, చికిత్సలను వేగవంతం చేయడానికి పరిశోధన ప్రతిపాదనల అమలుకు ఆసక్తి గల సంస్థలు, నిపుణులు ముందుకు రావాలని ఆహ్వానించింది. మరి ఇన్నేళ్లు గడిచినా క్యాన్సర్పై పోరాటంలో ప్రపంచం ఎందుకు పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోతోంది. పరిశోధనల ఫలితాలు ఎక్కడకు వెళుతున్నాయి. భవిష్యత్తులో అయినా ప్రజలను ఈ వ్యాధి నుంచి రక్షించే మార్గం ఉందా.