భువనగిరి (నల్గొండ) : బతుకమ్మ పండగను పురస్కరించుకొని తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందజేస్తున్న చీరల పంపిణీని అక్టోబర్ 2 నుంచి ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు చీరల పంపిణీకి కలెక్టర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. డీఆర్డీవో ఉపేందర్రెడ్డికి పంపిణీ బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో 2.80 లక్షల చీరలు అవసరంకాగా ఇప్పటి వరకు 1,70లక్షల చీరలు జిల్లాకు చేరుకున్నాయి. భువనగిరిలో 65 వేలు, ఆలేరు 25 వేలు, మోత్కూరు 33 వేలు, చౌటుప్పల్లో 47వేల చీరను గోదాముల్లో నిల్వ చేశారు. రెండు రోజుల్లో మిగిలినవి జిల్లాకు చేరుకుంటాయని, అక్టోబర్ 1 వరకు గ్రామాలకు వాటిని చేరవేస్తామని చేనేత జౌళిశాఖ జిల్లా సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు తెలిపారు.