Presidential Election : ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్మును అధికార ఎన్డిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి పార్లమెంటరీ బోర్డు మంగళవారం ఎంపిక చేసింది. బీజేపీ అగ్రనేతల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని వెల్లడించారు. తొలిసారిగా గిరిజన మహిళా అభ్యర్థికి ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని ప్రకటిస్తున్నామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు.
జార్ఖండ్ మాజీ గవర్నర్ అయిన ముర్ము (64) ఎన్నికైతే, ఆమె అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించిన మొదటి గిరిజన మహిళ అవుతుంది, కాగా విపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను ఖరారు చేయబోతుండగా..NDA అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పేరును ఖరారు చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగినప్పటికీ.. అంతకుముందు, ప్రతిపక్షం పాత్ర కోసం యశ్వంత్ సిన్హాను ఉమ్మడి పోటీదారుగా ప్రకటించింది. యశ్వంత్ సిన్హా అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.