Telangana high court permission for Warangal bjp public meeting :
వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో శనివారం బీజేపీ బహిరంగ సభ నిర్వహణకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు రోజున నిర్వహిస్తున్న సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. అయితే ఈ క్రమంలో వరంగల్లో ఎలాంటి సభలకు, ర్యాలీలకు అనుమతులు లేవంటూ.. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టులో ఆశ్రయించి పిటిషన్ను దాఖలు చేశారు.
కాగా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం శుక్రవారం నుంచి బుధవారం (ఆగస్టు 31) వరకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, ర్యాలీలపై పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ఆంక్షలు విధించారు. పోలీసు చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.