Minister KTR who once again expressed his anger against the Modi Government : కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి గత ఎనిమిదేళ్లుగా ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల కూడా మంజూరు చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైద్య విద్యలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) చరిత్ర సృష్టించారని కేటీఆర్ (Minister KTR) వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. 2014కు ముందు, గత 67 ఏళ్లలో కేవలం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఏర్పాటయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని, మరో 13 మెడికల్ కాలేజీలను త్వరలో నెలకొల్పుతామని, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని, దాదాపుగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీల ఫొటోలను ఆయన ప్రస్తావించారు. వనపర్తి, రామగుండం, జగిత్యాల, సంగారెడ్డి, నాగర్కర్నూల్లలో వైద్య కళాశాలలు దాదాపుగా పూర్తి కాగా, భద్రాద్రి కొత్తగూడెంలో ప్రభుత్వ వైద్య కళాశాలను త్వరలో ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు. సూర్యాపేట, మహబూబ్నగర్, సిద్దిపేట, నల్గొండలలో వైద్య కళాశాలలు ఇప్పటికే పని చేయడం ప్రారంభించాయని తెలిపారు.