![శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు](https://brighttelangana.com/wp-content/uploads/2022/01/Earthquake-in-Srikakulam-District.jpg)
Earthquake in Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు సంభవించడంతో స్థానికుల్లో ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని ఇచ్చాపురం, కంచిలి, కవిటిలో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం. 2 సెకన్ల పాటు రెండు సార్లు ప్రకంపనలు వచ్చినట్లు చెబుతున్నారు.
ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రజలు రెండు గంటలపాటు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. కొద్దిరోజుల వ్యవధిలో ప్రకంపనలు రావడం ఇది మూడోసారి అని కొందరు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, నష్టం జరగలేదు.