Bright Telangana
Image default

Alert : చైనాలో ఒక్క రోజే 3.7 కోట్ల కరోనా కేసులు..

telangana-govt-issues-advisory-after-surge-in-covid-cases

కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతుంది. కరోనా పుట్టినిల్లు చైనా లో మరోసారి తీవ్ర రూపం దాల్చుతుంది. ఒక్క రోజే దాదాపు 3.7 కోట్ల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో ఒకే రోజున కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 4 కోట్ల మందికన్నా కూడా ప్రస్తుత సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని చైనా ఆరోగ్య వాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాజధాని బీజింగ్‌తో పాటుగా సిచువాన్ ప్రావిన్స్‌లో సగానికి పైగా నివాసితులు కరోనా బారిన పడినట్లు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న చైనాలోని 18 శాతం జనాభాకు కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. కరోనా ప్రభావం మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో ఈ స్థాయి కేసులు నమోదుకావడం కూడా ఇదే తొలిసారి. ఈ కథనం ప్రకారం.. డిసెంబర్‌లో మొదటి 20 రోజుల్లో 24.8 కోట్ల మంది చైనా ప్రజలు వైరస్‌ బారిన పడ్డారు.

ఇది ఆ దేశ జనాభాలో దాదాపుగా 18 శాతం. చైనాకు చెందిన నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ అంతర్గత సమావేశంలో అధికారులు ఈ అంచనా వేశారు. ఈ సమావేశం వివరాలు బయటకు పొక్కడంతో ఈ లెక్కలు బహిర్గతమయ్యాయి. మరోపక్క అన్ని దేశాలు కరోనా ఆంక్షలు స్టార్ట్ చేస్తున్నాయి.

Related posts

650 Cops Tested Positive : కరోనా బారిన పడ్డ 650 మంది పోలీసులు

Hardworkneverfail

Producer Bandla Ganesh : బండ్ల గణేష్‌కు మూడోసారి కరోనా పాజిటివ్‌..

Hardworkneverfail

Saurav Ganguly : టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి కరోనా..

Hardworkneverfail

China Earthquake : చైనాలో భూకంపంతో 74 మంది మృతి

Hardworkneverfail

China Drought: తీవ్ర విద్యుత్ సంక్షోభంలో చైనా, 50 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత దుర్భరమైన కరవు

Hardworkneverfail

BF-7 Omicron Variant : ఇండియాలోకి ప్రవేశించిన బిఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్..

Hardworkneverfail