హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. కరోనా నిబంధనల నడుమ ఈ ఉప ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. హుజురాబాద్, బద్వేల్ రెండు స్థానాల్లో బైపోల్స్ జరగనుండగా.. ఇందుకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 1న విడుదల కానుంది. అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అలాగే అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ 13గా ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. బైపోల్స్ పోలింగ్ తేదీ అక్టోబర్ 30 కాగా.. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఇక అదే రోజున కౌంటింగ్ పూర్తి కాగానే ఫలితాలను వెల్లడిస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్ను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధిస్తూనే.. సభల్లో వెయ్యి మందికి పైగా జనం మించరాదని క్లారిటీ ఇచ్చింది.