నిజామాబాద్లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. షాపింగ్ మాల్ వద్ద చిన్నారిని మాయలేడీలు కిడ్నాప్ చేశారు. షాపింగ్ అయిన తర్వాత తల్లిదండ్రులు బిల్లు కడుతున్న సమయంలో చిన్నారి కిడ్నాప్కు గురైంది. తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు.