డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తన లక్ ని పరీక్షించుకుంటున్నాడు. ఇది వరకు హీరోగా ట్రై చేసిన ఆంధ్రా పోరీ నిరాశ పరచగా తర్వాత చేసిన మెహబూబా సినిమా కూడా ఆడియన్స్ ను మెప్పించలేదు. ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు పూరీ నిర్మాణంలో అనిల్ పదురి అనే కొత్త డైరెక్టర్ తో కలిసి చేస్తున్న సినిమా రొమాంటిక్ ఆడియన్స్ ముందుకు ఇప్పుడు ఈ నెల 29 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.
కరోనా వల్ల చాలా ఆలస్యం అయిన రొమాంటిక్ సినిమాను ఎట్టకేలకు వచ్చే వారంలో విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈనెల 29న విడుదల కాబోతున్న రొమాంటిక్ మూవీ పై ఉన్న అంచనాలను డబుల్ ట్రిపుల్ చేసే విధంగా ట్రైలర్ ఉంది. టైటిల్ కు తగ్గట్లుగానే సినిమా లో పుల్ రొమాన్స్ ఉంటుందని ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతోంది.