టి20 ప్రపంచకప్ 2021 : వెస్టిండీస్పై విజయం సాధించి ఇంగ్లండ్ తొలి అడుగు వేసింది. వెస్టిండిస్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇంగ్లాండ్ 8.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ జట్టులో బట్లర్ 24 పరుగులతో నటౌట్గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. విండీస్ బౌలర్లలో అకేల్ హోసిన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు టాస్ ఓడి భ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి కేవలం 55 పరుగులకే కూప్ప కూలిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టగా, టైమల్ మిల్స్ ,మొయిన్ అలీ చెరో రెండు వికెట్లు , క్రిస్ వోక్స్, జోర్డాన్ చెరో వికెట్ సాధించారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 14.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. విండీస్ బ్యాటింగ్లో ఒక్క క్రిస్ గేల్ తప్ప ఒక్కరు కూడా సింగిల్ డిజిట్ స్కోర్ ధాట లేకపోయారు. క్రిస్ గేల్ 13, సిమన్స్ 3, లూయిస్ 6, హెట్మెయిర్ 9, డ్వాన్ బ్రావో 5, నికోలస్ పూరన్ 1, కీరన్ పొలార్డ్ 6, రస్సెల్ డకౌట్, హోసెన్ 6*, మెక్కీ డకౌట్, రవిరాంపాల్ 2 ఇలావచ్చి అలా వెళ్లారు.