ఇప్పుడు తెలంగాణ అంతటా హుజురాబాద్ ఉపఎన్నిక గురించే మాట్లాడుకుంటున్నారు. భారీగా పోలింగ్ నమోదవడంతో ఎవరు గెలుస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్కు, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ క్రమంలో హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించి మరో రచ్చ జరుగుతోంది. ఎన్నికల తర్వాత ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను ప్రైవేట్ వాహనంలో తరలించడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈవీఎంను ఓ వ్యక్తి కారులో తరలిస్తుండగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆందోళనకు దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.