డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా ట్రై చేసిన ఆంధ్రా పోరీ నిరాశ పరచగా తర్వాత చేసిన మెహబూబా సినిమా కూడా ఆడియన్స్ ను మెప్పించలేదు. ఆ మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు పూరీ నిర్మాణంలో అనిల్ పదురి అనే కొత్త డైరెక్టర్ తో కలిసి చేస్తున్న మూవీ రొమాంటిక్. ‘అక్టోబర్ 29న విడుదల అయిన ఈ మూవీకి యవరేజ్ రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ ఇంటర్వ్యూ కూడా చేయించడం మరియు యూనిట్ సభ్యులు ప్రమోషన్లు భారీగా నిర్వహించడం వలన ఈ మూవీ పై కుర్రాళ్ళకి ఆసక్తిని పెంచేలా చేసాయి. దాంతో డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది ఈ మూవీ.
ఈ మద్య కాలంలో థియేటర్ రిలీజ్ అయిన మూవీలన్నీ కూడా 4 వారాల్లోనే స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. అన్ని మూవీల మాదిరిగానే ఈ మూవీ కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ మూవీని ఆహా వారు భారీ మొత్తంను పెట్టి కొనుగోలు చేసినట్లుగా సమాచారం. అక్టోబర్ 29న థియేటర్ రిలీజ్ అయిన ఈ మూవీని ఓటీటీ లో నాలుగు వారాలు ముగిసిన తర్వాత అంటే నవంబర్ 26న స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆహా అధికారికంగా ప్రకటించింది. దాంతో స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
'Vasco' and 'Monica' are here to charm you 🥰
— ahavideoIN (@ahavideoIN) November 16, 2021
Get ready to see the world in a Romantic way from November 26❣️#RomanticOnAHA @ActorAkashPuri @AnilPaduri @meramyakrishnan @purijagan #KethikaSharma pic.twitter.com/8dLFzTfEcP