తెలుగు సినీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘ఆచార్య’. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్టు చిరంజీవి ప్రకటించారు. ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవి కానుకగా థియేటర్లలో అలరించాల్సిన ఈ మూవీ.. కరోనా కారణంగా చిత్రీకరణ ఆలస్యమవడంతో విడుదల వాయిదా పడింది. ఇక ఇదిలా ఉండగా ఈ మూవీ భారీ బిజినెస్ జరుపుకుని రిలీజ్ కి కూడా రెడీ అవుతోంది.
అయితే థియేట్రికల్ గా భారీ బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ అంతే ఫ్యాన్సీ ధరకు ఓటిటి డీల్ క్లోజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ మూవీ ఓటిటి డీల్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారితో జరిగినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్ అయిన కొన్ని వారాలకు ఆచార్య మూవీ ఓటిటి లో రానుంది.
ఇక భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూనే మూవీలో ఎంతో కీలకమైన సిద్ద అనే పాత్రలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.