CM KCR Meeting On Dalitha Bandhu : దళితబంధు పథకం అమలుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. దళితుల్లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహమే లక్ష్యంగా రాష్ట్రంలో దళితుల బందును అమలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. నేటి సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితబందు అమలుపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. జిల్లా కలెక్టర్ల బదిలీలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలిసింది.