Centre Alerts Over Omicron Cases : దేశంలో పెరుగుతున్న ఓమిక్రాన్ వేరియంట్ కేసులపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. డెల్టా కంటే ఓమిక్రాన్ వేరియంట్ కేసులు మూడు రెట్లు వేగంగా విస్తరిస్తాయని కేంద్రం తెలిపింది. కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను పెంచడంపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు.
కోవిడ్ డేటాను విశ్లేషించి, రాష్ట్రాలు, జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్-19 డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని, అందువలన కఠినమైన ఆంక్షలు విధించాలని కోరింది.