![Third Wave LIVE Updates](https://brighttelangana.com/wp-content/uploads/2022/01/Third-Wave-LIVE-Updates.jpg)
Third Wave LIVE Updates : ఇండియాలో కొవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న ఒమైక్రాన్ కేసులే అందుకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ముందుగానే పసిగట్టి ఇప్పటికే అప్రమత్తం చేయగా.. రాష్ట్ర ప్రభుత్వలు మరిన్ని ఆంక్షలకు దిగుతున్నాయి. ఢిల్లీలో తాజాగా 187 పరీక్షలు చేయగా, 152 (81%) ఒమైక్రాన్ బయటపడింది. 8 నెలల్లో ఎన్నడూ లేనంతగా ఢిల్లీలో సోమవారం 5,000 కేసులు వచ్చాయి. ఆదివారంతో పోలిస్తే ఇవి 28% అధికం. పాజిటివ్ రేటు 6.46కు చేరింది. ముంబైలో రెండో రోజూ 8,000 పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో థర్డ్ వేవ్ మొదలైందని.. దీనికి ఒమైక్రానే కారణమని.. జాతీయ సలహా కమిటీ చీఫ్ డాక్టర్ ఎన్కే ఆరోరా చెప్పారు.
మెట్రో నగరాలు అయినా కోల్కతా, ఢిల్లీ, ముంబైల్లో 75% పైగా కేసులకు ఒమైక్రానే కారణమని పేర్కొన్నారు. డిసెంబరు చివరి వారం ప్రారంభంలో పరీక్షలు చేయగా 12% వాటిలోనే ఒమైక్రాన్ బయటపడిందని, ఇప్పుడది 28% కి చేరిందన్నారు. థర్డ్ వేవ్ మార్చి – ఏప్రిల్ వరకు కొనసాగుతుందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ తెలిపారు. ఎలక్షన్స్ లో జరిగే ర్యాలీలు సూపర్ స్ర్పెడర్లుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. థర్డ్ వేవ్ జనవరి – మార్చి మధ్య వస్తుందని మణీంద్ర గతంలో తెలిపారు. రోజుకు 1.80 లక్షల కేసులు వస్తాయన్నారు.