![BJP Leader Etela Rajender Press Meet - Huzurabad Bypoll Results](https://brighttelangana.com/wp-content/uploads/2021/11/BJP-Leader-Etela-Rajender-Press-Meet-Huzurabad-Bypoll-Results.jpg)
గెలుపు అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తనను అత్యధిక మెజారితో గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు ఈటల రాజేందర్ కృతఙ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్ ప్రజలకు తన గెలుపును అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు రాజేందర్.. హుజూరాబాద్ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాన్నారు. తన గెలుపుకోసం పనిచేసిన ప్రతిఒక్క కార్యకర్తకు, నాయకులకు కృతఙ్ఞతలు తెలిపారు.
5 అంశాలపై పోరాటం:
దళిత బంధును హుజూరాబాద్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలనీ
దళిత బంధును తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్
పేదరికంతో బ్రతికే ప్రతిఒక్కరికి కులంతో పనిలేకుండా దళిత బంధు వంటి అవకాశం కల్పించాలి
ఉద్యోగ నోటిఫికేషన్ల వెయ్యాలని డిమాండ్
సొంత భూమిలో డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవాళ్లని డిమాండ్
పై 5 అంశాలపై రేపటి నుంచే తన పోరాటం మొదలు పెడతానని ఈటల తెలిపారు. పేద ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అవుతా అన్నారు ఈటల రాజేందర్.