Bright Telangana
Image default

తెలంగాణలో ఆర్టీసీ చార్జీల మోత! ..సంస్థ ప్రతిపాదనలివే

telangana rtc bus charges hike

తెలంగాణ – హైదరాబాద్‌‌‌‌: త్వరలోనే తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయానికి వచ్చింది. 2021, నవంబర్ 07వ తేదీ ఆదివారం ఛార్జీలు పెంచాలని ప్రతిపాదనలు చేసింది. డీజిల్‌‌‌‌ రేట్ల తగ్గింపు నేపథ్యంలో పెంపు ప్రతిపాదనలను సవరించారు. ఆర్టీసీ చైర్మన్‌‌‌‌ బాజిరెడ్డి గోవర్ధన్‌‌‌‌, ఎండీ సజ్జనార్‌‌‌‌, ఇతర ఆఫీసర్లతో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌‌‌‌ ఆదివారం సమీక్ష జరిపారు. చార్జీల పెంపుపై చర్చించారు. ఎంత ఆదాయం వస్తోంది, ఎంత నష్టం వాటిల్లుతోంది, డీజిల్‌‌‌‌ రేట్ల తగ్గింపు వంటివాటిపై ఆరా తీశారు.

నిజానికి ఆఫీసర్లు 2 నెలల క్రితమే చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించారు. అన్ని రకాల బస్సుల్లోనూ కిలోమీటర్‌‌‌‌కు 35 పైసలు పెంచాలని సూచించారు. కానీ తాజాగా కేంద్రం డీజిల్‌‌‌‌పై లీటర్ పై రూ.10 తగ్గించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చార్జీలు అంత భారీగా పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని, ఆక్యుపెన్సీ తగ్గే ప్రమాదమూ ఉందని అధికారులు వివరించారు. దాంతో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటరుకు 25 పైసలు, ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌, ఆపై బస్సుల్లో 30 పైసలు పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం. తద్వారా ఆర్టీసీకి ఏటా 700 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా ? లేదా ? అనేది చూడాలి.

కనీస చార్జీల పెంపు ఇలా..

బస్సుప్రస్తుతంప్రతిపాదించినది
ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌1520
డీలక్స్‌2025
సూపర్‌‌‌‌ లగ్జరీ2530
గరుడ ప్లస్‌‌‌‌3540

Related posts

TSRTC: ఆర్టీసీ యూనియన్లపై ప్రభుత్వం విధించిన రెండేళ్ల నిషేధం గడువు పూర్తి

Hardworkneverfail

Bus Fare Hike: తెలంగాణ ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు.. పెరిగినా చార్జీలు జూన్ 9 నుండి అమలు

Hardworkneverfail

TSRTC : తగ్గుతున్న ఆర్టీసీ ఆదాయం..తలపట్టుకుంటున్న యాజమాన్యం

Hardworkneverfail

అల్లు అర్జున్‌కు లీగల్‌ నోటీసులు పంపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌..

Hardworkneverfail