గోపీచంద్ – నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆరడుగుల బుల్లెట్’. ‘జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్’ పతాకం పై తాండ్ర రమేష్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ 2017 లోనే రిలీజ్ కావాలి కానీ ఆర్ధిక లావాదేవీల కారణంగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆ ఆటంకాలన్నీ తొలగిపోవడంతో అక్టోబర్ 8న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. కానీ ప్రమోషన్స్ పెద్దగా చేయడం లేదు. దాంతో సినిమాకి ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ నమోదయ్యాయి.
నైజాం | 0.12 cr |
ఉత్తరాంధ్ర | 0.09 cr |
సీడెడ్ | 0.08 cr |
ఈస్ట్ | 0.04 cr |
వెస్ట్ | 0.03 cr |
గుంటూరు | 0.07 cr |
నెల్లూరు | 0.03 cr |
కృష్ణా | 0.06 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 0.52 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.05 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 0.57 cr |
ఆరడుగుల బుల్లెట్’ మూవీకి రూ. 2.95 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. బ్రేక్ ఈవెన్ కు రూ. 3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం కేవలం 0.57 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇంకా బ్రేక్ ఈవెన్ కు రూ. 2.38 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. దానిని బట్టే ఓటిటి బిజినెస్ కూడా జరగనుంది. మరి చూద్దాం థియేటర్లో ఎంత వరకు బిజినెస్ చేస్తుందో వేచి చూడాలి.