తమిళ్తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు విశాల్ – ఆర్య ఇద్దరు. ఈ ఇద్దరి మూవీలు తెలుగులోనూ విడుదలవుతూ ఉంటాయి. ఇక విశాల్కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆర్యకు కూడా ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. గతంలో వీళ్లిద్దరు ‘అవన్ ఇవన్’ (వాడు వీడు) సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఆర్య నటించిన ‘ఐశ్వర్యాభిరస్తు’ సినిమాలో విశాల్ అతిథి పాత్రలో మెరిసారు. ఇపుడు మళ్లొసారి వీళ్లిద్దరు ‘ఎనిమి’ సినిమాలో మరోసారి ఢీ అంటే ఢీ అనబోతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ మూవీను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.
తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ట్రైలర్ను విడుదల చేశారు. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది అన్నది ఈ మూవీలో చూపించనున్నారు. అందులోనూ.. ఒకరు పోలీస్ మరొకరు క్రిమినల్ అయితే.. ఆ ఇద్దరి మధ్య పోరు ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించనున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.