తెలంగాణ : పెట్రోల్, డీజిల్ ధరలపై మేం నయా పైసా పెంచలేదని.. అందువల్ల రేట్లు తగ్గించేది లేదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. వ్యాట్ పెంచలేదు కాబట్టి మేం పెట్రోల్ రేట్లు తగ్గించమన్నారు. పెట్రోల్, డీజిల్పై సెస్ తీసేయాలని తాము ఆయన డిమాండ్ చేశారు.
కొండత పెంచి పిసరంత తగ్గించారన్నారు. ట్యాక్సుల రూపంలో మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యాట్ ఎంత ఉందో అంతే అమలు చేస్తున్నామన్నారు. కేంద్రం అనుకుంటే రూ. 77 రూపాయాలకే పెట్రోల్ ఇవ్వొచ్చు. ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం ఇంధన ధరలపై సెస్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెరగని అంతర్జాతీయ పెట్రోలు ధరలను కేంద్రం పెంచి ప్రజలను మోసం చేస్తుం ది. 4 రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్నందునే కంటితుడుపు చర్యగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు.