![](https://brighttelangana.com/wp-content/uploads/2021/10/harish-rao.jpg)
ధూమ్ ధామ్ కార్యక్రమం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో నిర్వహించారు. మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే లు ఆరూరి రమేష్, గాదరి కిషోర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, సైది రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘ఈటల రాజేందర్ కి ఓటమి భయం పట్టుకుంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏడేండ్ల కాలంలో ఏం పని చేసిందో.. ముందుందు ఏం చేస్తుందో చెప్పి ఓట్లు అడగాలి. బీజేపీ అబద్ధాలు చెప్పే పార్టీ. ఈటల రాజేందర్ కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాడు. హరీష్ రావు చెల్లని చెక్కులు ఇచ్చాడు అని ఈటల రాజేందర్ అబద్ధాలు చెప్తున్నాడు. గెల్లు శ్రీను ని గెలిపించండి.. వావిలాల ను మండలం చేసే బాధ్యత నాది. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నన్ని రోజులు ఏం చేయలేదు. ఇప్పుడు గెలిచి ఏం చేస్తాడు.. బీజేపీ పేద ప్రజలకు ఏం చేస్తారో చెప్పట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ లు, కళ్యాణ లక్ష్మీ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ మొదట దళితులకు మాత్రమే ఇచ్చారు. తరువాత అన్ని కులాల్లోని పేదలకు ఇస్తున్నారు.