టీ 20 ప్రపంచ కప్ 2021: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీ20 వరల్డ్ కప్లో ఇప్పటి వరకు ఓటమి చూడని పాకిస్థాన్, కేవలం ఒక ఓటమిని మాత్రమే చవిచూసిన ఆస్ట్రేలియా తలపడ్డాయి. హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి వరల్డ్ కప్ లో ఫైనల్ చేరింది. ఓవైపు పాకిస్తాన్, మరో వైపు పూర్తిగా ఫాంలో ఉన్న ఆస్ట్రేలియా ఇలా రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో పోటీ రసవత్తరంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాక్ నిర్ణిత ఓవర్లలో 175 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్ లో రిజ్వాన్ 67, జమాన్ 55 , అజమ్ 39 పరుగులు సాధించి స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు. ఇక 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదటి పాకిస్థాన్ బౌలర్ల పై విరుచుకుపడింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో డేవిడ్ వార్నర్ 49 పరుగులు చేయగా.. మార్కస్ స్టోయినిస్ 40 పరుగులు, మాథ్యూ వాడే 41 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. షాహీన్ అఫ్రిదీ ఒక వికెట్ తీశాడు.
ఇక ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ మిగిలిఉండగానే ఆస్ట్రేలియా తన లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో ఫైనల్ కు చోటు దక్కించుకుంది. వరుసగా వికెట్లు కోల్పోతున్నా ఏమాత్రం తడబడకుండా పోరాడి విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఇక ఫైనల్ లో ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ తో తలపడనుంది. చూడాలి ఈసారి కప్ ఎవరికి సొంతం అవుతుందో..