జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు లో ఇప్పటి వరకు కోటి రూపాయలు గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు. హిందీలో కోటి గెలిచారు కానీ మన దగ్గర మాత్రం ఎవరు మీలో కోటీశ్వరులులో ఆ ఫీట్ సాధించిన కంటెస్టెంట్ ఒక్కరు కూడా లేరు. ఈ క్రమంలోనే తెలుగు టెలివిజన్ రంగంలో మొట్టమొదటి సారి ఓ కంటెస్టెంట్ రూ.1 కోటి రూపాయలు సొంతం చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో మొదటి సారి ఈ అద్భుతం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యక్తిని అదృష్టం వరించింది. సుజాతనగర్ మండలానికి చెందిన బి.రాజారవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్నారు, ఇటీవల షోలో పాల్గొన్న ఆయన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రూ.కోటికి సంబంధించిన ప్రశ్న అంటూ జూనియర్ ఎన్టీఆర్ రవీంద్రను అడగ్గా.. సమాధానం చెప్పి ఫిక్స్ చేయండి అంటూ రవీంద్ర మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. మరి ఆలస్యం ఎందుకు త్వరగా వీడియో చూసేయండి.