సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్తతకు గురయ్యారనే విషయం తెలుసుకున్పప్పటి నుంచి అభిమానులు అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆయనకు ఏమైంది అంటూ ఆరా తీసారు. అందులోనూ శ్వాసకోస సంబంధిత సమస్యలున్నాయని.. న్యూమోనియాతో హాస్పిటల్ పాలయ్యారని తెలిసి కంగారు పడ్డారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలుపుతూ ఉన్నా.. సడెన్గా ఆయన తీవ్ర అస్వస్థతకు గురకావడం.. ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లడం ఆయన పాటలను ప్రేమించే కోట్లాది అభిమానులను కలిచివేసిందనే చెప్పాలి.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. సిరివెన్నెల నడిచే నక్షత్రంలా స్వర్గద్వారాలవైపు సాగిపోయారు.. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు.. మిత్రమా.. విల్ మిస్ యూ ఫరేవర్ అంటూ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
'సిరివెన్నెల' మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు pic.twitter.com/dcRFE4XPXn
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021
నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021
మిత్రమా … will miss you FOREVER !#SiriVennela #SirivennelaSeetharamaSastry pic.twitter.com/HJKsBNvQ4J