ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ప్రేమకథా మూవీ ‘రాధే శ్యామ్’. ఇందులోని తొలి పాట ‘ఈ రాతలే…’ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఇప్పుడు రెండో సాంగ్ ‘నగుమోము తారలే’ అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ లో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య ఉన్న గాఢమైన ప్రేమ, సముద్ర తీరాన అందమైన విజువల్స్ ను చూపించారు. ఈ రొమాంటిక్ సాంగ్ ను సిద్ శ్రీరామ్, కృష్ణకాంత్ పాడారు. ఇండియన్ మూవీ హిస్టరీలో ఒకేసారి ఒక మూవీకి రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే మొదటిసారి. హిందీ వెర్షన్ లో మిథున్ సంగీతాన్ని అందించగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ ఈ పాటకి తన సంగీతాన్ని అందించారు.
ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ వస్తోంది. సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ మూవీ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.