TPCC Chief Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని టీపీసీపీ చీఫ్ రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో నామమాత్రపు నిరసనలు వ్యక్తం చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీలు ఫోటోలకు ఫోజులు తప్ప చేసిందేమీ లేదన్నారు. నిరసన తెలుపుతున్నామని ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ప్రధానిని ఎందుకు నిలదీయడంలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.