Central government on Polavaram Project : కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చేసింది. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి కావడం అసాధ్యమని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్రం సోమవారం పార్లమెంటులో స్పష్టం చేసింది. 2022 ఏప్రిల్ నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఎన్నో కారణాల వల్ల పనుల్లో ఆలస్యమవుతోందని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టు పూర్తిపై టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర బిశ్వేశ్వర లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
పోలవరం ప్రాజెక్టు బాధితులకు పునరావాసం, పరిహారంలో ఆలస్యం మాత్రమే కాకుండా కరోనా పరిస్థితుల వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం అవుతోందని కేంద్రం వివరించింది. 88 శాతం స్పిల్ వే చానల్ పనులు పూర్తయ్యాయని.. ఎప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 73శాతం, పైలెట్ చానల్ పనులు 34శాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్ర సహాయమంత్రి బిశ్వేశ్వర వెల్లడించారు.