![petrol and diesel price today](https://brighttelangana.com/wp-content/uploads/2021/10/petrol-and-diesel-price-hike.jpg)
దీపావళి సందర్భంగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో సెంచరీ దాటి వాహనాదారులకు భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. తగ్గిన పెట్రో ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. పనిలో పనిగా వాహనాదారులకు మరింత ఉపశమనాన్ని కలిగించేలా రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ వ్యాట్ తగ్గించాలని సూచించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఆయిల్ కంపెనీలతో ప్రధాని మోడీ గత నెలలో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో రిలయన్స్ అధిపతి ముఖేశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. ఈ చర్చలు ముగిసిన పది రోజుల్లోనే కేంద్రం ప్రజలకు తీపి కబురు అందించింది.
తగ్గిన ధరలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర
హైదరాబాద్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.114.47, డీజిల్ రూ.107.37 ధరలు ఉండగా తగ్గిన ధరలతో రేపటి నుంచి లీటర్ పెట్రోల్ రూ.109.47, డీజిల్ ధర రూ.97.37 ఉండనుంది.