Bheemla Nayak Trailer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి కలిసి నటించిన యాక్షన్-థ్రిల్లర్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ మూవీ నుండి ఈరోజు (ఫిబ్రవరి 21) ట్రైలర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ‘భీమ్లా నాయక్’ మూవీ ఫిబ్రవరి 25, 2022న విడుదల కానుంది, ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ మూవీ టీమ్ ప్రమోషన్లో బిజీగా ఉంది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ‘నాయక్.. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ’ అంటూరానా దగ్గుబాటి చెప్పే డైలాగ్ బాగుంది. అంతేకాదు, ‘నేను ఇవతల ఉంటేనే చట్టం.. అవతలకి వస్తే కష్టం… వాడికి!’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగు త్రివిక్రమ్ మార్కును చాటుతోంది. ఇవే కాదు, ట్రైలర్ లో ఉన్న డైలాగులు చూస్తుంటే ‘భీమ్లా నాయక్’ మూవీ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్ధమవుతోంది.
మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్ అయిన ‘భీమ్లా నాయక్’కు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తుంది. సూర్యదేవర నాగవంశీ తన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తమన్ ఎస్.ఎస్. సంగీతం అందించాడు.