![ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్](https://brighttelangana.com/wp-content/uploads/2021/11/pawan-kalyan-fires-on-ap-govt.jpg)
ఆంధ్రప్రదేశ్ : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగిత జ్ఞానం ఉందా? అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ కి కోపం కావడానికి కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు పవన్ కళ్యాణ్ కు కోపం తెప్పించాయి.
ఓవైపు రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే ఇసుకు అమ్ముతానని ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే.. ప్రజల ఇళ్లు, వాకిళ్లు, పశు, పంట నష్టం జరుగుతోంది. పచ్చటి పొలాల్లో ఇసుక మేటలు వేసి వాళ్లంతా ఏడుస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం ఇసుక అమ్ముతాం అని ప్రకటనలు ఇస్తోంది. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా? అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే,ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం – పంట నష్టం,
— Pawan Kalyan (@PawanKalyan) November 21, 2021
పచ్చటి-పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే , ఇలాంటి
సమయంలో వైసీపీ ప్రభుత్వం 'యిసుక అమ్ముతాం ' అన్న ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ?? pic.twitter.com/43GorfXoZg