[the_ad id=”6756″]
Chittoor District Road Accident : భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి తిరుపతి సమీపంలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా మరియు గాయపడిన వారికి రూ. 50,000 ప్రకటించింది.
ముఖ్యమంత్రి స్వయంగా పరిస్థితిని పరిశీలించి రోడ్డు ప్రమాద కారణాలపై విచారణకు ఆదేశించారు. నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓ కుటుంబం వెళ్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు.