Bright Telangana
Image default

ప్రమాదకరంగా తిరుపతి రాయల చెరువు..లీకవుతున్న నీరు.. కట్ట తెగితే 100 గ్రామాలకు ముప్పు

ప్రమాదకరంగా తిరుపతి రాయల చెరువు

తిరుపతి సమీపంలోని రాయల చెరువు ప్రమాదకరంగా ఉంది. ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉంది. 15వ శతాబ్దం నాటి చెరువు ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. లీకేజీలు కూడా కనిపించాయి. ఓ చోట గండిని అధికార యంత్రాంగం పూడ్చివేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశించారు. ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ సహా అధికార యంత్రాంగం మొత్తం ఆ ప్రాంతంలో పర్యటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. 0.9 టి.ఎం.సి నీళ్ళు రాయల్ చెరువులో ప్రస్తుతం వున్నాయి.

గతంలో ఇంత కెపాసిటీ నీళ్ళు గతంలో ఏ చెరువుకు రాలేదు. కాబట్టి సమీపంలోని 20 గ్రామాల ప్రజలు ఎవరు ఇళ్ళలో ఉండకండి. రెండు అంతస్తుల భవనంలో కూడా ఎవరు ఉండకండి. పరిస్థితులు బాగాలేదు… కాబట్టి ముందుగానే ప్రజలను అప్రస్తుతం చేస్తున్నాం.. ప్రజలు తప్పనిసరి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. ఇరిగేషన్ అధికారులు పరిశీలించి చర్యలు చేపడుతున్నారు. ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో వున్నాయి అని పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లా ఇంకా ముంపులోనే మగ్గుతోంది. వందలాది గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో నానుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయ్. నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి.

Related posts

Crypto Currency Suicide: నెలకు లక్షన్నర జీతం వదిలేసి, క్రిప్టోలో పెట్టుబడులు పెట్టారు, చివరికి..?

Hardworkneverfail

Bharat Bandh : దేశ వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు, రేపు భారత్ బంద్ ..

Hardworkneverfail

Tirupati Rains: భారీ వర్షాలతో బీభత్సం.. తిరుపతిలో వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు

Hardworkneverfail

Kolleru: మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో ఉన్న నాటుసారా స్థావరాల్ని ధ్వంసం చేసిన ఎస్పీ

Hardworkneverfail

Pawan Kalyan : ఇంగిత జ్ఞానం ఉందా ? ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

Hardworkneverfail

Kadapa-Annamayya Project: చుక్క నీరు కూడా నిల్వ చేసే అవకాశం లేనంతగా ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది

Hardworkneverfail