ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు నటుడు సాయిధరమ్ తేజ్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రిపబ్లిక్’. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈసినిమాలో సాయితేజ్ కలెక్టర్గా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేశ్ కథానాయిక. అక్టోబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘రిపబ్లిక్’ ట్రైలర్ను బుధవారం ఉదయం చిరంజీవి విడుదల చేశారు.