నటుడు ఆలీ వ్యాఖ్యాతగా నిర్వహించే ‘ఆలీతో సరదాగా’ 250వ స్పెషల్ ఎపిసోడ్లో మోహన్ బాబు పాల్గొన్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో మోహన్ బాబు కాస్త ఎమోషన్కు గురైనట్లు కనిపిస్తోంది. ‘గతాన్ని నెమరువేసుకుంటే తెలయని దుఃఖం వస్తుంది.. నేను ఎంత రఫ్గా కనిపిస్తానో అంతకంటే చాలా సెన్సిటివ్, తట్టుకోలేను’ అంటూ ఎమోషన్ అయ్యారు.
ఆర్జీవీది ఒక దారి.. మీది ఒక దారి.. ఈ రెండు దారులు ఎలా కలిశాయి అని ఆలీ అడిగిన ప్రశ్నకు మోహన్ బాబు బదులిస్తూ.. ‘టెక్నిషియన్గా అతనికి హాట్సాఫ్ చెబుతాను. వ్యక్తిగతం అంటావా.. మనం మాట్లాడలేం’ అని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. మరి మోహన్ బాబు జీవితంలో జరిగిన సంఘటనలు, ఆయన చెప్పిన విశేషాలు తెలియాలంటే షో టెలికాస్ట్ అయ్యే వరకు (సోమవారం) వేచి చూడాల్సిందే.