![](https://brighttelangana.com/wp-content/uploads/2021/10/samantha-news.jpg)
సోషల్ మీడియా వేదికగా జరుగుతోన్న ట్రోల్స్పై సమంత కోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ కూకట్పల్లి కోర్టులో పిటిషన్ వేశారు. తనపై దుష్ప్రచారం చేసిన డాక్టర్ సీఎల్ వెంకట్రావుతోపాటు య్యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేసింది.
ఈ కేసుపై ఈరోజు విచారణ చేపట్టారు. సమంత ఇంకా విడాకులు తీసుకోలేదని, ఆ లోగానే ఆమెపై దుష్ప్రచారం చేస్తూ పరువుకు భంగం కలింగేలా ప్రవర్తించారని, సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని వార్తలు రాశారని, ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టారని సమంత తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమంత పిటిషన్ని అత్యవసరంగా విచారించేందుకు కోర్టు అభ్యంతరం తెలిపింది.హై రెప్యుటేడ్ పర్సనాలిటీకి సంబంధించిన అంశం కావడంతో త్వరగా వినాలని సమంత లాయర్ బాలాజీ కోర్ట్ ను కోరారు. అయితే లాయర్పై కూకట్పల్లి కోర్టు ఆగ్రహంవ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కోర్ట్ ముందు అందరూ సమానులే అన్న న్యాయమూర్తి.. ప్రొసీజర్ ప్రకారమే వాదనలు వింటామని స్పష్టం చేశారు.