![I Don't Have Any Issue With Tickets Price Says Nagarjuna](https://brighttelangana.com/wp-content/uploads/2022/01/I-Dont-Have-Any-Issue-With-Tickets-Price-Says-Nagarjuna.jpg)
I Don’t Have Any Issue With Tickets Price Says Nagarjuna : దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు మరోవైపు ఏపీలో తగ్గిన టికెట్ ధరలు.. మూవీ ఇండస్ట్రీ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ విడుదల వాయిదా పడింది. తాజాగా నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి నటించిన ‘బంగార్రాజు’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మూవీ విడుదల తేదీని ఖరారు చేసేందుకు మూవీ యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ నాలుగు సంవత్సరాలుగా ఎంత కష్టపడిందో తనకు తెలుసని… ‘రాధేశ్యామ్’ మూవీ యూనిట్ కూడా ఎన్నో ఏళ్లుగా శ్రమించిందని… ఈ మూవీస్ విడుదల వాయిదా పడటం బాధను కలిగిస్తోందని నాగార్జున అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ రెండు పాన్ ఇండియా మూవీస్ కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల కాకపోవడమే మంచిదని చెప్పారు. తమ మూవీని మాత్రం విడుదల చేస్తున్నామని అన్నారు.
ఏపీలో మూవీ టికెట్ ధరలు తగ్గించడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. టికెట్ ధర ఎక్కువగా ఉంటే తమకు ఎక్కువ డబ్బులొస్తాయని, ధర తక్కువుంటే తమకు తక్కువ డబ్బులొస్తాయి అంతేనని నాగార్జున చెప్పారు. తమ మూవీ విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి బాగోలేకపోయినా మూవీని జేబులో పెట్టుకుని ఉండలేమని చెప్పారు. అందుకే వసూళ్లు తక్కువగా వస్తాయని తెలిసినా మూవీని విడుదల చేస్తున్నామని అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ మూవీస్ సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడం వల్ల తమ మూవీని ఎంత లాభమనేది ఇప్పుడే చెప్పలేమని… మూవీ విడుదల తర్వాత తెలుస్తుందని వ్యాఖ్యానించారు.