![Second Phase of Hyderabad Metro Expansion](https://brighttelangana.com/wp-content/uploads/2022/12/Second-Phase-of-Hyderabad-Metro-Expansion.jpg)
Second Phase of Hyderabad Metro Expansion : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదారబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ లో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలు విస్తరణకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్.. డిసెంబర్ 9వ తేదీన సెకండ్ ఫేజ్ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే నగరంలోని మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో విస్తరణ కోసం 31 కిలోమీటర్లకు గాను రూ.6,250 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తెలిపారు.
ఎయిర్పోర్టు మెట్రో కారిడార్లో వచ్చే మెట్రో స్టేషన్లు..
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో మెట్రో రైలు మార్గం అనుసంధానమైతే కేవలం 25-30 నిమిషాల్లో విమానాశ్రయం నుంచి ఐటీ కారిడార్లోని రాయదుర్గం, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ సైబర్ టవర్స్కు చేరుకోవచ్చు. సుమారు 30 కి.మీ దూరం ఉండే ఈ మార్గంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మెట్రో స్టేషన్ చొప్పున సుమారు 7-8 మెట్రో స్టేషన్లను నిర్మించేలా డీపీఆర్ను సిద్ధం చేశారు. ఇందులో ప్రధానంగా బయో డైవర్సిటీ జంక్షన్, నానక్రాంగూడ, నార్సింగి, టీఎస్ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్టౌన్ , ఎయిర్పోర్టు కార్గో స్టేషన్, టర్మినల్ వద్ద మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు.