![ind vs pak](https://brighttelangana.com/wp-content/uploads/2022/08/ind-vs-pak.jpg)
Asia Cup 2022 (దుబాయి) : ఆసియా కప్ 2022లో వోరావోరీగా జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత బౌలర్ల దెబ్బకు మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీమ్ 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. రెండు దేశాల క్రికెట్ అభిమానులే కాకుండా ప్రవంచ వ్యాప్తంగా కూడా క్రికెట్ ఫాన్స్ ఈ మ్యాచ్పై ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసారు. మాజీ క్రికెట్లు, సీనియర్లు భారత్కే ఛాన్స్ అంటూ పలువురు విశ్లేషణలు కూడా చేసారు. అందరూ అనుకున్నట్లుగానే ఈ వోరావోరీ మ్యాచ్లో భారత్ పాకిస్థాన్పై విజయం సాధించింది.
భారత్ జట్టులో చివరి మూడు బంతుల్లో ఆరు పరుగులు అవసరమైన దశలో కళ్లు చెదిరే సిక్స్ బాది హార్ధిక్ పాండ్యా జట్టును గెలిపించాడు. మరో ‘రెండుబంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది. 2021 టి20 ప్రపంచ కప్లో భారత్ జట్టుఉని పది వికెట్ల తేడాతో పాక్ ఓడించగా తాజా గెలుపుతో దాయాది లెక్కని టీమిండియా సరిచేసింది. పాక్జట్టులో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 43 వరుగులుచేసి ఆతడు ఒక్కటే చెప్పుకోదగిన మార్కును సాధించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్కుమార్ నాలుగు వికెట్లు తీసాడు. వార్ధిక్ పాంద్య మూడు, అర్హదీప్సింగ్రెండు, అవేశ్ఖాన్ ఒక వికెట్ తీసారు. తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచనలేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో మహ్మాద్ రిజ్వాన్తో కలిసి పాకిస్థాన్ ఇన్నింగ్స్ను ప్రారంభించిన కెప్టెన్ బాబర్ ఆజమ్ పది పరుగులుచేసాడు.
ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే జెట్ అయ్యాడు. టి20 ప్రపంచకప్ తర్వాత భారత పాకిస్థాన్ జట్లు తలపడిన తొలిమ్యాచ్ ఇదే కావడంతో ఉత్కంఠభరితంగా సాగింది. బ్యాటింగ్ చేపట్టిన భారత్ 148 పరుగుల ఛేదనకు దిగింది. 16 ఓవర్లు ముగిసేసరికే 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. జదేజా 21, పాండ్యాలే జట్టును విజయంవైవు నడిపించారు. పాండ్యా 11 పరుగులతోను కొనసాగారు. కెరీర్లో వందో టి20 మ్యాచ్ ఆడుతున్న విరాట్కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. సెంచరీ చేస్తాడని అందరూ ఎంతో ఆశగా చూస్తే 34 బంతుల్లో 35 పరుగులుచేసి మవ్మాద్నవాజ్ బౌలింగ్లో ఇఫ్తికర్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇక టీమ్ కెప్టెన్ రోహిత్శర్మ 12 పరుగులకే బెట్ అయ్యాడు. రోహిత్ కూడా నవాజ్ బౌలింగ్లోనే ఇస్టికర్ అవ్మాద్కు క్యాచ్ ఇచ్చి బెట్ అయ్యాడు. మ్యాచ్ ప్రారంభంలోనే టీమిండియాకు షాక్ తగిలింది. నసీమ్షా బౌలింగ్లో కెఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీనితో గోల్డెన్ దక్గా వెనుదిరగాల్సి వచ్చింది. బ్యాటింగ్ కష్టంగా ఉన్న పిచ్పై కోహ్లీ ౩5 వరుగులతో పర్వాలేదనిపించినా జదేజా 35 పరుగులతో ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు మాత్రమే చేసి అంతగా ఆకట్టుకోలేదు. ఇలాంటి క్షిష సమయంలోనే హార్థిక్ పాండ్యా 33 పరుగులతో నిలిచి చివరి మూడు బంతుల్లోనే ఒక బంతికి సిక్సర్బాది జట్టును అవలీలగా గెలిపించాడు.
సూర్య బెట్ అయిన తర్వాత వచ్చిన ఆతడు జడేజాతో కలిసి మంచి భాగస్వామ్యం ఇచ్చాడు. చివరిలో జడేజా బౌట్ అయినా దినేశార్తిక్ ఒకే ఒక్కపరుగుచేసి సింగిల్ తీసి నాటౌట్గా నిలిచాడు. హార్ధిక్ సిక్సర్తో భారత్కు విజయం నమోదు చేసాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ మూడు వికెట్లు తీయగా నసీమ్షా రెండు వికెట్లు తనథాతాలో వేసుకున్నాడు. ప్రత్యేకించి చివరి ఓవర్లో భారత్ విజయానికి ఏడు పరుగులు అవసరం అయ్యాయి. స్పిన్నర్ నవాజ్ బౌలింగ్లో తొలి బంతికే జదేజా ‘భెట్ కాగా హార్ధిక్ పాండ్యా ఏకైక సిక్సర్తో మ్యాచ్ను ముగించేసాడు. భారత్ ఆసియాకప్లో తన తర్వాత మ్యాచ్ను ఈనెల 31న హాంకాంగ్ జట్టుతో ఆడాల్సి ఉంది.