![India vs Afghanistan](https://brighttelangana.com/wp-content/uploads/2021/11/ind-vs-afg-t20.jpg)
టీ 20 ప్రపంచ కప్ 2021: కీలక మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. స్కాట్లాండ్ పై 8 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. తొలుత టీమిండియా బౌలర్లు చెలరేగగా, ఆ తర్వాత బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
86 పరుగుల టార్గెట్ ను ఇండియా రెండు వికెట్లు కోల్పోయి కేవలం ఆరు ఓవర్లలోనే ఫినిష్ చేసింది. ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 6.3 ఓవర్లలో 89 పరుగులు చేసింది. దీంతో 91 బంతులు మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో భారీ విక్టరీ కొట్టింది. టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. కేఎల్ రాహుల్ ( 19 బంతుల్లో 50 పరుగులు 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (16 బంతుల్లో 30 పరుగులు.. 5 ఫోర్లు, 1 సిక్సర్) లతో దీపావళి మెరుపులు మెరిపించారు.
దీంతో గ్రూపు2లో పాయింట్ల పట్టికలో టీమిండియా మొత్తం 4 మ్యాచుల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో మూడో స్థానానికి చేరింది. ఇక కీలకమైన నెట్ రన్ రేట్లో +1.619 తో టాప్లో నిలిచింది. ఇక ప్రస్తుతం ఇండియా సెమీ ఫైనల్స్ చేరాలంటే న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్పైన ఆధారపడి ఉంది. ఈ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ టీం గెలిస్తేనే ఇండియా సెమీ ఫైనల్ చేరుకుంటుంది.