![T20 World Cup 2021: 20 రన్స్ తేడాతో వెస్టిండీస్ పై శ్రీలంక గెలుపు](https://brighttelangana.com/wp-content/uploads/2021/11/wi-vs-sl-t20.jpg)
టీ 20 ప్రపంచ కప్ 2021: టోర్నీలో ముందుకు వెళ్లాలి అంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ ఓడి.. ట్రోఫీ ఆశలు చేజార్చుకుంది వెస్టిండీస్. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్, శ్రీలంక తలపడ్డాయి. వెస్టిండీస్పై శ్రీలంక 20 పరుగులు తేడాతో విజయం సాధించింది. 190పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 8 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవరల్లో 169 పరుగులకే పరిమితమైంది. హెట్మైర్( 81) చివర వరకు పోరాడిన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దీంతో సెమీస్ రేస్ నుంచి వెస్టిండీస్ తప్పుకుంది. శ్రీలంక బౌలర్లలో బినూర ఫెర్నాండో, చమిక కరుణరత్నే, వనిందు హసరంగా చెరో రెండు వికెట్లు సాధించారు. శ్రీలంక ఈ మ్యాచ్ లో గెలవడమే కాదు, తమతో పాటు విండీస్ ను కూడా టోర్నీపై ఆశలు వదులుకునేలా చేసింది..
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. నిస్సాంక, అసలంక ఆర్ధసెంచరీలతో చేలరేగడంతో నీర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 189 పరుగులు చేసింది.వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్ రెండు వికెట్లు, బ్రావో వికెట్ సాధించాడు.