సాయి తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘జె.బి.ఎంటర్టైన్మెంట్స్’ ‘జీ స్టూడియోస్’ బ్యానర్ల పై జె.భగవాన్, జె.పుల్లారావు లు కలిసి నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 1న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ.. ఓపెనింగ్స్ మాత్రం చాలా దారుణంగా నమోదయ్యాయి.
నైజాం | 0.97 cr |
ఉత్తరాంధ్ర | 0.45 cr |
సీడెడ్ | 0.67 cr |
ఈస్ట్ | 0.23 cr |
వెస్ట్ | 0.24 cr |
గుంటూరు | 0.29 cr |
నెల్లూరు | 0.17 cr |
కృష్ణా | 0.23 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 3.25 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.18 Cr |
ఓవర్సీస్ | 0.28 Cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 3.71 cr (షేర్) |
ప్రత్యేక గుర్తింపు ఉన్న దేవ కట్టా దర్శకుడు కావడంతో ‘రిపబ్లిక్’ మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 13.60 కోట్లు బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.14 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఇక, ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 3.71 కోట్లు వసూలు చేసింది. దీంతో మరో రూ. 10.29 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్గా నిలుస్తుంది.