గోపీచంద్ – నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆరడుగుల బుల్లెట్’. ‘జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్’ పతాకం పై తాండ్ర రమేష్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ 2017 లోనే రిలీజ్ కావాలి కానీ ఆర్ధిక లావాదేవీల కారణంగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆ ఆటంకాలన్నీ తొలగిపోవడంతో అక్టోబర్ 8న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. కానీ ప్రమోషన్స్ పెద్దగా చేయడం లేదు. దాంతో సినిమాకి బిజినెస్ కూడా అంతంత మాత్రమే జరిగింది. ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే :
నైజాం | 1.00 cr |
ఆంధ్రా(అన్ని ఏరియాల్లో) | 1.20 cr |
సీడెడ్ | 0.50 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 2.70 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.25 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 2.95 cr |
‘ఆరడుగుల బుల్లెట్’ మూవీకి రూ. 2.95 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. దానిని బట్టే ఓటిటి బిజినెస్ కూడా జరగనుంది. మరి చూద్దాం థియేటర్లో ఎంత వరకు బిజినెస్ చేస్తుందో వేచి చూడాలి.