బ్లాక్ బస్టర్ మూవీ ఉప్పెన తరువాత వైష్ణవ్ తేజ్ నుండీ రాబోతున్న మూవీ కొండపొలం. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఉప్పెన మూవీ అనుకున్న దానికంటే 3 రెట్లు ఎక్కువగా కలెక్ట్ చేసినప్పటికీ కొండ పొలం సినిమా జానర్ ఎక్స్ పెరి మెంటల్ మూవీ అవ్వడం తో సినిమా బిజినెస్ తక్కువే జరిగింది. తెలుగు రాష్ట్రాలలో సినిమా మొత్తం మీద 570 థియేటర్స్ లో రిలీజ్ కాగా వరల్డ్ వైడ్ గా కలిపి 720 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అయితే మొదటి షో తోనే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లు పెద్దగా నమోదుకాలేదు.
కొండపొలం మూవీ మొదటి రోజు వచ్చిన షేర్ :
నైజాం | 0.32 cr |
ఉత్తరాంధ్ర | 0.30 cr |
సీడెడ్ | 0.11 cr |
ఈస్ట్ | 0.12 cr |
వెస్ట్ | 0.11 cr |
గుంటూరు | 0.22 cr |
నెల్లూరు | 0.70 cr |
కృష్ణా | 0.10 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 1.34 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.12 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 1.46 cr |
‘కొండపొలం’ మూవీకి రూ. 7.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు సినిమా ఇంకా 6.54 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ ని సాధిస్తుంది. బ్రేక్ ఈవెన్ దృశ్యా ఈ ఓపెనింగ్స్ సరిపోవనే చెప్పాలి. ఇక వీకెండ్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.